ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి తన కంటూ ప్రత్యేక మైన స్థానాన్ని సంపాదించు కున్నాడు.మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమా చేస్తున్నాడు.
ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్ ఈసారి కూడా విభిన్న కథ తో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.తాజాగా చిత్ర టీమ్ సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసారు.ఈ సినిమాలో అన్ని ముఖ్య పాత్రలకు సంబంధించి ఈ వీడియోలో పొందు పరిచారు.
ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని పాత్రలు మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడని తెలుస్తుంది.ఫీల్ ది ఇంటెన్సిటీ అంటూ ఈ వీడియోను విడుదల చేసి సినిమాను చూసేందుకు సిద్ధంగా ఉండండి అని టీమ్ మెంబెర్స్ ట్వీట్ చేసారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగస్టు 19 న తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
మరి చూడాలి మహా సముద్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో.