పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ వెండితెర మీద కనిపించబోతున్నాడు.ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాదు అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తుంది.ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు.
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9 న విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రచయిత రామ జోగయ్య శాస్త్రి మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన వకీల్ సాబ్ చిత్రం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు.ముందుగా ఈ సినిమా టైటిల్ వేరే అనుకున్నాం అని కానీ చివరగా వకీల్ సాబ్ అని ఫైనల్ చేసాం అని తెలిపారు.
ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఈ సినిమా టైటిల్ ను ‘మగువ‘ అనుకున్నామని ఆయన వివరించారు.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు గా ఈ టైటిల్ ను మార్చమని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా పవన్ ఈ సినిమాతో పాటు పవన్ మరొక మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతోపాటు ఒక రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.