ఇదీ నెస్లే ఇండియా మాగీ నూడుల్స్ కథ.ఈ నూడుల్స్ తింటే ఆరోగ్యం మటాష్ అవుతుందని, రోగాలు వస్తాయని టెస్టులు చేసి తేల్చాయి ఇండియాలోని పరిశోధన సంస్థలు.
దీని ప్రకటనల్లో నటించిన బాలివుడ్ తారలకు అధికారులు నోటీసులు పంపారు.మాగీ ఇండియాలో ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో నెస్లే ఇండియా మార్కెట్లో ఉన్న తమ స్టాక్ వెనక్కి తీసుకుంది కూడా.
మాగీని విదేశాల్లో కూడా టెస్ట్ చేసి ఇది హెల్త్ పాడు చేయదని నిర్ధారించారు.ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే పని చేసారు.
గోవాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో మాగీని టెస్టు చేసారు.మాగీ ఆరోగ్యం పాడు చేయదని, ఇది మంచి ప్రమాణాలతో ఉందని అధికారులు చెప్పారు.
మాగీ ప్రియులకు ఇది శుభ వార్త.తాము మళ్ళీ ఇండియాలోకి వస్తామని గతంలో నెస్లే ఇండియా చెప్పింది.
దాని కల ఫలిన్చినట్లేనా.