నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాడు.ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాని ముగింపు దశకి తీసుకొచ్చేశాడు.ఈ నెల ఆఖరుకి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది.
వెంటనే గ్యాప్ లేకుండా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా షెడ్యూల్ కి రెడీ అయ్యింది.
నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.పీరియాడికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
ఇక 80 ఏళ్ల వృద్ధుడుగా ఒక పాత్ర ఉంటుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇప్పటికే సాయి పల్లవి, కృతి శెట్టిని కన్ఫర్మ్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమా మూడో హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.
ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ ని ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ మూడు పాత్రలకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ రోజు ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు.
అలాగే జనవరి ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.నాని కెరియర్ గతంలో జెండాపై కపిరాజు సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు.
తరువాత జెంటిల్మన్ సినిమాలో కూడా రెండో సారి చేశారు.అందులో ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు మూడో సినిమాని డ్యూయల్ రోల్ అది కూడా చాలా భిన్నమైన కథతో చేస్తున్నాడు.మరి ఈ సినిమా నానికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.