అమెరికాలో అమెజాన్ ఈ సంస్థలో పని చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి స్విమ్మింగ్ కి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందడం జరిగింది.21 సంవత్సరాల వయస్సులోనే అమెరికా దేశానికి వెళ్లి జాబ్ సంపాదించుకుని.తల్లిదండ్రుల కళలను నెరవేరుస్తూ చేతినిండా డబ్బు సంపాదించుకుంటూ మంచి భవిష్యత్తు ఉన్న సమయంలో.ప్రవీణ్ చనిపోవటంతో వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అమెరికా ఆస్టిన్ లో తెలుగు ప్రాంతానికి చెందిన మాదినేని సాయి ప్రవీణ్ కుమార్.ఈనెల 18వ తారీకున స్నేహితులతో కలిసి జిమ్ కి వెళ్లిన తర్వాత ప్రైవేట్ క్వారీ లేక్ లో పెడల్ పోర్డింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందడం జరిగింది.
ప్రవీణ్ కి అంతంతమాత్రంగానే.స్విమ్మింగ్ రావటంతో అదే టైంలో లైఫ్ జాకెట్ కూడా తోడ కాకపోవడంతో… ఈ ప్రమాదం సంభవించింది.దీంతో దాదాపు మూడు గంటల పాటు రెస్క్యూ టీం డెడ్ బాడీ ని వెతికి బయటకు తీయడం జరిగింది.ప్రవీణ్ తల్లిదండ్రులు హైదరాబాద్ మియాపూర్ లో ఉంటారు.
అసలు వీరి స్వస్థలం గుంటూరు జిల్లా అత్తలురు.రెండు రోజుల్లో అమెరికా ప్రభుత్వం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి ఆ తర్వాత హైదరాబాద్ శుక్రవారం చేరుకునే అవకాశం ఉన్నట్లు.
ప్రవీణ్ బంధువులు తెలుపుతున్నారు.సరైన సమయంలో చేతికి వచ్చిన టైంలో కొడుకు చనిపోవడంతో.
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.