దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.జూన్ 21వ తారీకు నుండి ఇ దేశంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరకి వ్యాక్సిన్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావటంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది.
గతంలో వయస్సు పరిమితి ప్రభుత్వాలు పెట్టడంతో.కొద్దిపాటి మందే వ్యాక్సిన్ వేయించుకునే పరిస్థితి ఉండేది.
కానీ ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులే అని కేంద్రం తెలపడంతో పాటు వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తూ ఉండటంతో రాష్ట్రాలలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనాలు పోటెత్తుతున్నారు.ఈ క్రమంలో లో దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒక్కరోజులోనే 16 ,73,858 మందికివ్యాక్సిన్ అందించటం దేశంలోనే రికార్డు నెలకొల్పినట్లు అయింది.
జూన్ 21వ తారీకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్వహించగా చాలామంది పాల్గొనటంతో.ఈ ఘనత మధ్యప్రదేశ్ రాష్ట్రం సాధించినట్లు అయింది.వ్యాక్సిన్ పంపిణీ కోసం దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్లనే రకార్డు సాధించినట్లు తెలుస్తోంది.