వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో రికార్డ్ నెలకొల్పిన మధ్యప్రదేశ్..!!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.జూన్ 21వ తారీకు నుండి ఇ దేశంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరకి వ్యాక్సిన్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావటంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది.

 Madhya Pradesh Sets Record In Vaccination Distribution  Madhya Pradesh, Vaccinat-TeluguStop.com

గతంలో వయస్సు పరిమితి ప్రభుత్వాలు పెట్టడంతో.కొద్దిపాటి మందే వ్యాక్సిన్ వేయించుకునే పరిస్థితి ఉండేది.

కానీ ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులే అని కేంద్రం తెలపడంతో పాటు వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తూ ఉండటంతో రాష్ట్రాలలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనాలు పోటెత్తుతున్నారు.ఈ క్రమంలో లో దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒక్కరోజులోనే 16 ,73,858 మందికివ్యాక్సిన్ అందించటం దేశంలోనే రికార్డు నెలకొల్పినట్లు అయింది.

జూన్ 21వ తారీకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్వహించగా చాలామంది పాల్గొనటంతో.ఈ ఘనత మధ్యప్రదేశ్ రాష్ట్రం సాధించినట్లు అయింది.వ్యాక్సిన్ పంపిణీ కోసం దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్లనే రకార్డు సాధించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube