మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది.ఇక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
రేవా జిల్లా సమీప ప్రాంతంలో ఓ ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బలంగా ఢీకొంది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు.
మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో బస్సు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది.
రేవాకి 25 కిలోమీటర్ల దూరంలో గుద్ రోడ్డు దగ్గర ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదానికి బస్సు అతి వేగంగా రావడమే దీనికి కారణమని తెలుస్తోంది.ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.