మధ్యప్రదేశ్‌లో విషాదం: రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది.ఇక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

 Madhya Pradesh-TeluguStop.com

రేవా జిల్లా సమీప ప్రాంతంలో ఓ ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బలంగా ఢీకొంది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు.

మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో బస్సు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది.

Telugu Madhyapradesh, Telugu Ups-

రేవాకి 25 కిలోమీటర్ల దూరంలో గుద్ రోడ్డు దగ్గర ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.

‍ఈ ప్రమాదానికి బస్సు అతి వేగంగా రావడమే దీనికి కారణమని తెలుస్తోంది.ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube