ప్రస్తుతం దేశం లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే.ఇక ప్రస్తుతం అన్ని పనులు వాయిదా పడుతున్న సమయంలో.
గత కొన్ని నెలల నుండి శుభకార్యాలకు ముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు వచ్చేప్పటికి మళ్లీ ఈ వైరస్ వెంటాడుతుంది.గతేడాది కూడా ఇదే సమయం పెళ్లిళ్లు అతి తక్కువ సమక్షంలో జరగగా.
మళ్లీ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదురవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా వైరస్ నేపథ్యంలో పెళ్లి ఆపడానికి వెళ్లిన అధికారులే పెళ్లి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంలో లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓ పెళ్లి వేడుక జరిగింది.అసలు కారణం ఏంటంటే వరుడికి ఏప్రిల్ 19 న కరోనా పాజిటివ్ రావడంతో తహసీల్దార్ నవీన్ గార్గ్, అధికారులు ఈ పెళ్లిని ఆపడానికి వచ్చారు.
కానీ సీనియర్ అధికారి సూచన మేరకు పీపీఈ కిట్లు ధరించి వివాహం జరిపించాలని అనుమతి ఇచ్చాడు.ఇక వరుడి తరఫున నలుగురు, వధువు తరఫున నలుగురు హాజరయ్యి వీళ్లంతా కూడా వధూవరులతో పాటు పీపీఈ ఇట్లు ధరించారు.
ఇక వధూవరులు పీపీఈ కిట్లు ధరించి తమ ఆచారం ప్రకారం హోమం గుండం చుట్టూ వేద మంత్రాలతో తిరిగారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.
ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఏఎన్ఐ పంచుకుంది.ఇక రోజు రోజుకు వైరస్ కేసులు సంఖ్యలో పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధాలు విధించారు.
అంతేకాకుండా ప్రస్తుతం పెళ్లిళ్లు ముహూర్తాలు దగ్గర పడుతున్న సమయంలో వధూవరుల తల్లిదండ్రులకు మళ్లీ ఈ వైరస్ విజృంభన ఎదురవక తప్పట్లేదు.