ఒక ముఖ్యమంత్రి ఈ స్టేజ్ పైన అందరి ప్రజలు చూస్తుండగానే డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డాన్స్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి స్టేజ్ పైనే డ్యాన్స్ చేశారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.ఆదివారం నాడు సెహోర్ జిల్లా భిలాయ్ గ్రామానికి చెందిన
గిరిజనులకు అటవీ హక్కులకు
సంబంధించిన లీజు సర్టిఫికెట్లను అందజేశారు.2006వ సంవత్సరం ముందు నుంచి అడవుల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ లీజ్ పట్టాలని అందజేశారు.అయితే ఈ కార్యక్రమానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు శివరాజ్ సింగ్ ని బాగా ఉత్సాహ పరచడంతో ఆయన డాన్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో కొందరు గిరిజనులు తమ సంప్రదాయ నృత్యం చేస్తుంటే వారిని చూసి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా డాన్స్ చేశారు.ఆయన ముఖానికి మాస్క్ ధరించి.
సంప్రదాయ విల్లంబులు పట్టుకొని స్టేజ్ పైనే నృత్యం చేశారు.దీంతో అక్కడున్నవారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు.
ఆదివాసీలకు తాము బాగా మేలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఆదివాసుల కోసం చేసిందేమీ లేదని శివరాజ్ సింగ్ చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ నేతలు గిరిజనుల భూములను కబ్జా చేసి, వారిని కోర్టు కేసుల్లో ఇరికించి ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ వలన నష్టపోయిన ఆదివాసులకి తాము న్యాయం చేస్తామని ఆయన అన్నారు.తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఆయన అనడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.