ఈ ప్రశ్న అడిగింది ఒక సినిమా నటినే.అయితే ఆమె నటించింది సినిమాలో కాదు.
అది అశ్లీల సినిమా కూడా కాదు.కాని అభ్యంతరకరమని భావించిన అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
ఆమె ఒకప్పుడు బాలీవుడ్ని షేక్ చేసిన టాప్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.ఆమె ఒక వ్యాపార ప్రకటన చిత్రంలో అంటే యాడ్ ఫిలింలో నటించారు.
ఆ ప్రకటన పాపులర్ ఫుడ్ ప్రోడక్్ట ‘మ్యాగీ’కి సంబంధించింది.అందులో మాధురి మ్యాగీలో ఉండే పోషక విలువల గురించి వివరించి మ్యాగీ తినమని ప్రోత్సహించింది.
ఇదే ఆమె చేసిన తప్పు అని ఉత్తరాఖండ్ ఆహార, ఔషధ శాఖ నోటీసులు జారీ చేసింది.పాపులర్ తినుబండారమైన మ్యాగీలో సీసం, మోనోసోడియం గ్లుటామెట్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని పరిశోధనలో తేలినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారులు తెలిపారు.
ఈ ఆహార పదార్థాన్ని మార్కెట్ నుంచి తొలగించాలని దీన్ని ఉత్పత్తి చేస్తున్న నెస్లె ఇండియాపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.మ్యాగీలో ప్రమాదకరమైన సీసం, మోనోసోడియం ఉన్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
మరి ఈ విషయం మాధురికి తెలుసో లేదోగాని ఆమె మాత్రం వ్యాపార ప్రకటనలో నటించింది.దీనిపై పదిహేను రోజుల్లో జవాబు ఇవ్వాలని అధికారులు ఆమెకు పంపిన నోటీసులో ఆదేశించారు.
ఆమెను అనుకున్న సమయంలో జవాబు రాకపోతే కేసు బుక్ చేస్తామన్నారు.డబ్బు కోసం నటించే సినిమా తారలకు ఈ విషయాలు తెలుసుకునే తీరిక ఉంటుందా?
.