ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవారితో పాటు ఫేడ్ అవుట్ అయిన అందాల భామలు అందరూ డిజిటల్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు.డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కే వెబ్ సిరీస్ లపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
వెబ్ సిరీస్ ల ద్వారా డబ్బుకి డబ్బు, అలాగే నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తూ ఉండటంతో సినిమాల కంటే వెబ్ సిరీస్ లు బెటర్ అని హీరోయిన్స్ భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో మంచి కథలతో వచ్చే దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.
అలాగే ఫ్యూచర్ అంతా వెబ్ సిరీస్ లదే హవా అని ముందుగానే ఫిక్స్ అయ్యి అటుగా కెరియర్ కోసం అడుగులు వేస్తున్నారు.కితకితలు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి మధుశాలిని తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది.
కమర్షియల్ హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో ఈ భామ సక్సెస్ కాలేదు.అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.
చివరిగా తెలుగులో గూఢచారి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ నటించిన ఎక్స్ పైరీ డేట్ వెబ్ సిరీస్ తాజాగా విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ అమ్మడు ఆసక్తికర విషయాలను పంచుకుంది.సినిమాలలో హీరో, హీరోయిన్, విలన్ నేపధ్యంలోనే కథలు ఉంటాయి.అయితే వెబ్ సిరీస్ కి వచ్చేసరికి ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది.రెండు గంటల్లోనే మొత్తం చూపించాలనే తొందర ఉండదు.
ప్రస్తుతానికి అయితే వెబ్ సిరీస్లపై తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువగా ఆసక్తి చూపుతున్నారు.అయితే పరిస్థితి మారుతోంది.
నా మొదటి సినిమా కితకితలు సమయానికి, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.మార్పులను మనం ఆహ్వానించాలి.
ఇక వెబ్ సిరీస్ లలో అయినా కథ నచ్చితే బోల్డ్ క్యారెక్టర్ చేయడానికైనా తాను సిద్ధమే అని మధుశాలిని చెప్పుకొచ్చింది.