కుంకుమ పువ్వు యాక్టర్ మధు ప్రకాశం భార్య భారతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.నిన్న రాత్రి భారతి(34) హైదరాబాద్ లోని మణికొండ పంచవటి కాలనీ లోని తన ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే మధు ప్రకాష్ వేధింపులే కారణం అంటూ భారతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కూడా వారి మధ్య చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో భారతి ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
మధు ప్రకాష్ కు గుంటూరు కు చెందిన భారతి తో 2015 లో వివాహం జరిగింది.
మధుప్రకాష్ టీవీ నటుడిగానే కాకుండా కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు.ఐతే భారతి మాత్రం ఒక ప్రయివేట్ కంపెనీ లో ఉద్యోగం చేసుకుంటూ అత్తమామల తో కలిసి మణికొండ లో నివసిస్తుంది.అయితే సీరియల్స్ తో బీజీ గా ఉన్న కారణం గా మధు రోజూ లేట్ గా రావడం తో అది నచ్చని భారతి సీరియల్స్ మానేయాలని చెబుతూ ఉండేది.
దానికి తోడు సహనటి తో మధు క్లోజ్ గా ఉంటున్నాడని తెలుసుకొని దానికి కూడా గొడవ పడుతుండడం తో వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి.ఈ విషయంపై పలు మార్లు పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
మంగళవారం కూడా ఇద్దరి మధ్య మరోసారి ఇలానే గొడవ జరగడం తో మధు ప్రకాష్ భారతి ని ఏమాత్రం పట్టించుకోకుండా షూటింగ్ నిమిత్తం బయలుదేరి వెళ్ళిపోయాడు.అయితే మధ్యలో ఒకసారి భారతి వీడియో కాల్ చేసి తాను ఉరేసుకుంటున్నట్లు బెదిరించినప్పటికీ అదేం పట్టించుకోకుండా మధుప్రకాష్ షూటింగ్లో నిమగ్నమయ్యారు.మరలా రాత్రి ఇంటికి 7.30 నిమిషాలకు వచ్చారు.
మధుప్రకాష్ ఎంత పిలిచినా భారతి తలుపు తీయకపోవడంతో.అనుమానమొచ్చి ఆయన మరో తాళంతో.డోర్ తీసి లోపలికి వెళ్లి చూసేసరికే చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని భారతి కనిపించింది.దీనితో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో పోలీసులు అక్కడకి చేరుకొనిమృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.