బిగ్ బాస్ కార్యక్రమంలో జరుగుతున్న అరాచకాలు ఈ కార్యక్రమంపై పూర్తిగా ఆసక్తి తగ్గేలా చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో కొందరి కంటెస్టెంట్ లతో పాటు హోస్ట్ వ్యవహారశైలి ఏమాత్రం నచ్చలేదంటూ పలువురు నెటిజన్లు సెలబ్రిటీలు ఈ కార్యక్రమం పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై నటి మాధవి లత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈ కార్యక్రమానికి హోస్ట్ సరిగా లేరని నాగార్జున నుంచి మొదలుకొని కంటెస్టెంట్ ల వరకు ప్రతి ఒక్కరిని ఏకి పారేసింది.
తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరిని ఆడపిల్లే కాదంటూ షాకింగ్ కామెంట్ చేసింది.
ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ దూకి ఎవరు ఎక్కువ టీ షర్ట్లు ధరిస్తే వారు విజేతలు అంటూ ఈ టాస్క్ లో సిరి, సన్నీని పాల్గొనాలని బిగ్ బాస్ చూపించారు.
అయితే స్విమ్మింగ్ పూల్ లో టాస్క్ అనడంతో వ్యక్తిగత కారణాల వల్ల ఈ టాస్క్ నుంచి సిరికి మినహాయింపు కావాలని సంచాలకుడు రవిని అడిగింది.అయితే బిగ్ బాస్ తనకు బదులుగా వేరే వారిని కాపాడాలని తన గెలిస్తే సిరి గెలిచినట్టు అని చెప్పడంతో సిరి షణ్ముఖ్ ని కాకుండా మానస్ తన బదులు ఆడాలని కోరుతుంది.
ఇక మానస్, సన్నీ ఈ టాస్క్ లో పాల్గొనగా చివరికి సన్నీ టీ షర్ట్ లు సరిగ్గా ధరించలేదని, మానస్ విజేత అని ప్రకటించారు.అయితే ఈ విషయంపై నటి మాధవి లత స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.ఒక సంచాలకుడిగా వ్యవహరిస్తున్న వారు ఆ టాస్క్ రూల్స్ అన్ని ముందుగా చెప్పాలి కానీ మధ్యలో చెబితే ఎలా అంటూ రవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మానస్ ను తిట్టే సిరి తన బదులు షణ్ముఖుని కాకుండా కావాలనే మానస్ ను పోటీకి పంపించింది.
తన బదులు షణ్ముఖ్ ను పంపించొచ్చు కదా.మరి షణ్ముక్ వెళ్తే తను వాటేసుకోవడానికి ఎవరూ లేరని తనని పంపించి ఉండదు అసలు ఈ సిరి ఆడపిల్లే కాదు రాక్షసి పిల్ల అంటూ తన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.