దేశంలో ఫేక్ ప్రజలు ఎక్కువైపోయారంటున్న హీరోయిన్....

సినిమాల్లో అవకాశాలు లేక ప్రజలకు సేవ చేయాలని మంచి ఉపాయంతో రాజకీయాల్లోకి  వెళ్లినటువంటి హీరోయిన్ మాధవీలత ఏదో ఒక సమస్యతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దారుణంగా ఓడిపోయింది.

 Madhavi Latha Reacts About Bjp Election Results In Delhi-TeluguStop.com

ఈ విషయంపై మాధవీలత తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా దేశంలో ఫేక్ ప్రజలు ఎక్కువ అయిపోయారని తనకు ఈ అంశం అస్సలు నచ్చలేదని, దేశం వదిలి పెట్టి వెళ్లిపోవాలని ఉందని అన్నారు.

అంతేగాక ప్రస్తుతం దేశంలోని ప్రజలు  పైకి  కృత్రిమ నవ్వులతో కనిపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేగాక మరో మూడు శాతం మంది ఓట్లు వేసి ఉంటే ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించేదని అన్నారు.

Telugu Actressmadhavi, Madhavi Latha-Movie

దీంతో నెటిజన్లు ఈ విషయం పై దారుణంగా ట్రైల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ప్రజలని ఏ పార్టీ నాయకులు కూడా అంచనా వేయలేరని అంటున్నారు కొందరు.మరికొందరైతే.దేశంలో పార్టీ ని బట్టి కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు చేసినటువంటి మంచిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు వేస్తారని అంతేగాని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడతారని అనుకోవడం తమ అమాయకత్వం అని అంటున్నారు.

అలాగే మనుషులు స్వేచ్ఛగా జీవించడానికి ప్రపంచంలో కెల్లా భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు మరెక్కడా లేవని ఒకవేళ ఉంటే నిరభ్యాంతరంగా వెళ్లిపోవచ్చని సలహాలు ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube