అనుష్క టైటిల్ రోల్ లో హేమంత్ మధుకర్ దర్సకత్వంలో తెరకెక్కి తాజగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా నిశ్శబ్దం.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని పూర్తిగా అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.
హాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.అలాగే మాధవన్ లాంటి స్టార్ యాక్టర్, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ కాంబినేషన్ అనేసరికి సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించడంతో ఈ సినిమాలో ఏదో విషయం ఉందనే విధంగా ప్రేక్షకులు ఆలోచించారు.దానికి తగ్గట్లుగానే సినిమా టైటిల్, పోస్టర్, ఫస్ట్ లుక్, ట్రైలర్ విషయంలో ప్రేక్షకులకి సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేశారు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ అయితే నిశ్శబ్దం ఒక అద్భుతమైన చిత్రం అని చెప్పుకొచ్చారు.
అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అనేక వాయిదాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినా ఈ సినిమా అంచనాలని ఏ మాత్రం అందుకోలేకపోయింది.
ఒక సాధారణమైన సినిమాగా మిగిలిపోయింది.కథ బాగుందనే టాక్ వచ్చిన కథనం పూర్తిగా గాడితప్పిందని, అసలు సంబంధం లేకుండా కథనం నడిపించారని, ఎక్కడా కూడా ప్రేక్షకులకి థ్రిల్, గాని సస్పెన్స్ గా క్రియేట్ చేయలేకపోయారని విమర్శలు వచ్చాయి.
పెద్ద స్టార్ క్యాస్టింగ్ ని తీసుకున్న ఎవరిని కరెక్ట్ గా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.సినిమాలో మాధవన్ ని హీరోగా ప్రాజెక్ట్ చేసి ఫైనల్ గా సైకోలో రిప్రజెంట్ చేశారు.
ఇది ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేదని ఆడియన్స్ నుంచి అభిప్రాయం వచ్చింది.ఈ విషయాన్ని ఒక అభిమాని సోషల్ మీడియాలో మాధవన్ లైవ్ లో ప్రస్తావించారు.
సినిమాలో క్లైమాక్స్ అస్సలు కన్విన్సింగ్ గా లేదని అనిపిస్తుంది.దీనికి మీరేమంటారు అని అడిగాడు.
దానిపై మాధవన్ తాను సారీ చెప్పగలని చెప్పాడు.అలాగే మీరూ కొన్ని గెలుస్తారు.
కొన్నిటిని కోల్పోతారు.నేనేం చెప్పగలను.
మేము మా వంతు ప్రయత్నం చేస్తాము అని అన్నారు.