మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురైన బైక్ కి సంబంధించి మాదాపూర్ డీసీపీ కీలక ప్రకటన చేశారు.విషయంలోకి వెళితే ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పై సాయి ధరమ్ తేజ్ 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
అంత మాత్రమే కాక బైక్ సెకండ్ హ్యాండ్ అని కూడా వివరించారు.ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుండి ఈ బైక్ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.
యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు.బైక్ అసలు వానర్ అనిల్ కుమార్ నీ పిలిపించి.మరింత సమాచారం రాబడతామని వెల్లడించారు.ఇక ఇదే తరుణంలో బైక్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఇంకా పూర్తి కాలేదని డీసీపీ తెలిపారు.
గతంలో మాదాపూర్ ఏరియాలో పర్వతాపూర్.వద్దా ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ఈ బైక్ పై 1035/- జరిమానా కూడా విధించటం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.