లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిపోయారు.ఈ కారణంగా ఈ సీజన్ లో జరగాల్సిన చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.
భౌతిక దూరం ఉండాల్సిందే అని ప్రభుత్వం చెప్పడంతో రెండు నెలల పాటు ఎవరు పెళ్లి జోలికి వెళ్ళలేదు.అయితే కొంత మంది మాత్రం అతికొద్ది సన్నిహితుల మధ్య పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
అలాగే టాలీవుడ్ లో కూడా దిల్ రాజు, హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు.దిల్ రాజుకి ఇది రెండో పెళ్లి కాగా, నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉండి ఇప్పుడు తన ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కాడు.
అయితే వీరి పెళ్లిపై చాలా మంది విషెస్ చెబుతూ ఉంటే కొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు.ఇలాంటి సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవడం అంత అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇదే కోవలోకి ఒకప్పటి హీరోయిన్ మాధవీలత కూడా వచ్చి చేరింది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేసే ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
అసలు ఆగట్లేదుగా జనాలు.మాస్క్ లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం, అదీ పోతే మాఘమాసం, లేకుంటే మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.ఏ పెళ్లికి పిల్ల దొరకదా, లేకుండా పిల్లోడు మారిపోతాడా.అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు.
మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా.కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా.
ఫిక్స్ అయిన మ్యారేజ్ లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారా.సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏంటో నాకు అర్థం కావడం లేదు కామెంట్స్ చేసింది.
నా పోస్ట్ నా ఇష్టం.నా ఒపీనియన్ నేను చెప్తా.
నాకు ఆ హక్కు ఉంది’ అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.అయితే ఎవరు ఎలా పెళ్లి చేసుకుంటే నీకేంటి సమస్య అంటూ నెటిజన్లు ఆమె మీద విమర్శలు చేస్తున్నారు.
కొంత మంది మాధవీలత చెప్పిన మాటలు కరెక్టే కదా అని సమర్ధిస్తున్నారు.
.