ఇండియన్ 2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ విరిసిపడి ముగ్గురు సినిమా కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది.
సినిమా కళాకారులు, కార్మికుల భద్రతపై పెద్ద చర్చ నడిచింది.వాళ్ళ ప్రాణాలకి గ్యారెంటీ లేకుండా బ్రతుకుతున్నారని, ఇండస్ట్రీలో కార్మికులపై ఎంత నిర్లక్ష్యం ఉంది అనే విషయాలు బయటపడ్డాయి.
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి వందల మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు.అయితే ఎలాంటి ప్రమాదం జరిగిన వారికి నిర్మాత నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి సహాయం అందుతున్న దాఖలాలు లేవు.
ఇదిలా ఉంటే ఈ పద్ధతి మారాలని భావించిన తమిళ స్టార్ హీరో శింబు తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాకి కార్మికుల తరుపున ఏకంగా 30 కోట్ల ఇన్సురెన్స్ చేయించాడు.ఈ సినిమా నిర్మాత 7.8 లక్షల ప్రీమియం చెల్లించి ఈ ఇన్సురెన్స్ తీసుకున్నట్లు సమాచారం.శింబు నిర్మాతగా కార్మికుల ఇన్సురెన్స్ చేయించమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కార్మికుల సంక్షేమం కోసం హీరో శింబు, నిర్మాత సురేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ సంక్షేమం కోసం ఆలోచించిన మొట్ట మొదటి హీరో శింబు అని అంటున్నారు.
అతనిలానే మిగిలిన నిర్మాతలు, హీరోలు కూడా కార్మికుల సంక్షేమం కోసం భీమా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.