టాలీవుడ్ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడిగా నిలబడాలని మంచు విష్ణు కోరుకున్న విషయం తెల్సిందే.అయితే అనుభవజ్ఞుడు మరియు సహాయ గుణం కలిగిన వాడు అయిన రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్ష ఎన్నికల్లో నిలుచోవాలని నిర్ణయించడంతో మంచు విష్ణు తన పోటీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.
మంచు విష్ణు అథ్యక్షుడు కాలేక పోయినా, ఆయన సోదరి మంచు లక్ష్మి ఉపాధ్యక్షురాలు అయ్యింది.ఈమెను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లుగా మా ప్రకటించింది.
మాకు ఇద్దరు ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి మరియు శివ కృష్ణలు ఎన్నికయ్యారు.వీరిద్దరు కూడా ఏకగ్రీవం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
ఉపాధ్యక్షులు, కార్య నిర్వాహణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, అధ్యక్ష పోటీ మాత్రం తీవ్రంగా ఉంది.మా అధ్యక్ష పదవికి ఇద్దరు ప్రముఖులు పోటీ పడుతుండటంతో ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా కూడా మా అధ్యక్ష ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు.అంతగా వేడి రగిల్చిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో చివరకు ఎవరు నెగ్గుతారో చూడాలి.