బుల్లి తెరపై ఎన్నో సంచలనాలను ఆవిష్కరించిన ఓంకార్ ఆ మధ్య ‘జీనియస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు.
అయితే నిర్మాతకు మాత్రం లాభాలు వచ్చింది లేదు.దాంతో ‘జీనియస్’కు తాను చేసిన తప్పును తెలుసుకుని తన రెండవ సినిమా ‘రాజుగారి గది’ని రెండు కోట్లలోనే తెరకెక్కించాడు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు.ఫస్ట్లుక్కు ముందు చేసిన ప్రమోషన్ హంగామాతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో పెరిగాయి.
అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఉండటంతో సినిమాపై కూడా ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది.భారీ అంచనాలున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మాటీవీ 1.6 కోట్లు పెట్టి దక్కించుకుంది.ఈ సినిమా బడ్జెట్లో దాదాపుగా సగానికి పైగా శాటిలైట్ రైట్స్ ద్వారా రావడంతో నిర్మాత కూడా అయినా ఓంకార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
‘ప్రేమకథా చిత్రమ్’, ‘గీతాంజలి’ చిత్రాల తరహాలోనే ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది.భారీ అంచనాలున్న ఈ సినిమాను త్వరలో విడుదలకు సిద్దం చేస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్కు కూడా భారీ క్రేజ్ ఉంది.దాంతో నిర్మాత ఓంకార్కు మస్త్ మస్త్ లాభాలని ట్రేడ్ విశ్లేషఖులు అంటున్నారు.