మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.పెద్ద ఎత్తున ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక తాజాగా హేమ మాట్లాడుతూ మా యొక్క డబ్బును వృదా చేస్తున్నారు.
నరేష్ మరియు ప్రస్తుత మెంబర్స్ అంతా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆమె విమర్శలు చేసింది.ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి.
మా పరువు పోయే విధంగా ఉండటం మాత్రమే కాకుండా మా ఎన్నికల సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మా అధ్యక్షుడు నరేష్ మరియు కీలక మెంబర్స్ జీవిత ఇతరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఆ సమావేశంలో మా యొక్క నిధులు ఎన్ని ఉన్నాయి.ఇంతకు ముందు ఉన్న నిధులు ఎన్ని.
ఈ సమయంలో మా యొక్క నిధులు ఎన్ని ఖర్చు చేయడం జరిగింది, ఎన్ని నిధులను సమకూర్చడం జరిగింది అనే విషయాలను లెక్కలతో సహా వివరించారు.దాదాపుగా అయిదు కోట్ల రూపాయలు ప్రస్తుతం మా వద్ద ఉన్నట్లుగా అధ్యక్షుడు ప్రకటించాడు.
ప్రతి ఒక్క ఖర్చుకు లెక్క ఉంటుందని.ఎవరు అడిగినా ఉంటుంది.
దీనిలో దాపరికం ఏమీ లేదు.అయినా కూడా కొందరు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు.
హేమ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా మా పరువు పోయింది.ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేసినట్లుగా నరేష్ పేర్కొన్నారు.
వారు కనుక బ్యాన్ చేస్తే హేమ పోటీ చేసే అవకాశంను కోల్పోతుంది అంటూ సమాచారం అందుతోంది.