టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ ఎన్నికల విషయంలో కొందరు కొన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు.
ముఖ్యంగా పోటీకి దిగాలని అనుకునే వారు ఇప్పటికే తమను తాము అభ్యర్థులుగా ప్రకటించారు.కొందరు మాత్రం ఈ ఎన్నికలను ఏకగ్రీవంగా చేస్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి మా ఎన్నికల వేడి ఈ వర్షం కాలం కూడా హీట్ పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు.ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ పెద్దలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తే నేను ఖచ్చితంగా వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటూ ప్రకటించాడు.
మరో వైపు ఆయన మా భవనం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
మంచు విష్ణు భవనం కట్టేందుకు ముందుకు వచ్చాడు సరే.మొదటగా ఎక్కడ భూమి ఉందో చెప్పాలి కదా అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.ఆ విషయంలో ఆయనకు క్లారిటీ లేదు అయినా కూడా తాను ప్రెసిడెంట్ ను అంటూ ముందుకు వస్తున్నాడు అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.
మీడియా వర్గాల్లో మా ఎన్నికల గురించి ఎవరు మాట్లాడినా కూడా అదో పెద్ద చర్చగా మొదలు అవుతుంది.నాగబాబు మొదలుకుని చాలా మంది కూడా మా ఎన్నికల గురించి మాట్లాడాడు.
మా ఎన్నికలు ఏంటీ అంటూ బాలయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.బాలకృష్ణ మా మెంబర్ అయ్యి ఉండి ఇప్పటి వరకు ఎప్పుడు పట్టించుకోలేదు.కాని ఆయన ఇప్పుడు మాత్రం మా భవనం ఎందుకు కట్టలేదు అంటూ ప్రశ్నించడం అవివేకంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పరిస్థితి చూస్తుంటే పెద్దలు ఏకగ్రీవంకు ప్రయత్నించే అవకాశాలు లేవని.
ఎన్నికలు జరిగి తీరాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.