సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి.అయితే ఇప్పటికే మా ఎలక్షన్లు జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితులు కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ సారి జరగబోయే ఎన్నికలలో నటి హేమ కూడా బరిలో ఉన్నారు.నటి హేమ గత రెండు రోజుల క్రితం ప్రస్తుతం మా అధ్యక్షుడు అయినటువంటి నరేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మాఅధ్యక్షుడు పై ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక ఆడియో బయటకు రావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
ఈ విధంగా నటి హేమ మా అధ్యక్షుడు పై ఆరోపణలు చేయడంతో ఈ విషయం పై మా అధ్యక్షుడు నరేష్ స్పందించి తనదైన శైలిలో హేమకు కౌంటర్ ఇచ్చారు.
ఈవిధంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకొని సీరియస్ అయినట్లు తెలుస్తుంది.మా గురించి ఈ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేస్తూ మా ప్రతిష్టను దిగజారుస్తున్నారు అంటూ నటి హేమ పై క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడుకి లేఖ రాస్తూ తొందరగా ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు.
ఈ క్రమంలోనే మా క్రమశిక్షణ సంఘం రంగంలోకి దిగి నటి హేమ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు పై చేసిన ఆరోపణలకు ఆమె వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా క్రమశిక్షణ మండల కమిటీ ఆ నోటీసులో తెలియజేసింది.ఈ క్రమంలోనే ఎన్నికల త్వరగా నిర్వహిస్తామని చెప్పడంతో మా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.