గతంలో మాదిరిగానే ఈసారి కూడా మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.ఒక మాట చెప్పాలంటే ఈసారి ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ను కలుగ జేస్తున్నాయి.
మొదట పర భాష నటుడు అయిన ప్రకాష్ రాజ్ తాను మా ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.పర భాష నటుడు అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
అద్బుతమైన ఫాలోయింగ్ ఉండటంతో పాటు ఆయనకు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పేరు కూడా ఉంది.అందుకే ఆయన గెలుస్తాడని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ప్రకాష్ రాజ్ కు పోటీగా తాను నిలుస్తానంటూ మంచు విష్ణు ప్రకటించాడు.ఆ తర్వాత జీవిత రాజశేఖర్.
ఆ తర్వాత హేమలు కూడా రంగంలోకి దిగబోతున్నట్లుగా చెప్పారు.ఇంత మంది పోటీ పడుతున్న మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఆయన ప్యానల్ బలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా గెలుపు సాధిస్తుందనే నమ్మకం ను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండగా ఆయన ప్యానల్ లో ఇంకా జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయి కుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాష్ ఇంకా ముఖ్యులు ఉన్నారు.
వీరికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.అలాగే ప్రేక్షకుల్లో కూడా అభిమానం ఉంది.కనుక ఈ ప్యానెల్ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మరి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు ఉన్న ఒక్క మైనస్ స్థానికేతరుడు.ఆ ఒక్క మైనస్ ను అధిగమించి గెలుపు సాధిస్తాడా అనేది చూడాలి. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు పోటీ గా అవతల కూడా గట్టి పోటీ అయితే నిలబడే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో ప్రచారం పై గెలుపు ఆధారపడి ఉంటుంది.