మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల సందడి మొదలు అయ్యింది.మొదటి నుండి కూడా ఈ ఎన్నికల హడావుడిలో మంచు విష్ణు కాస్త అతిగా వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
నేను సొంతంగా మా కోసం భవనం కట్టిస్తాను నన్ను ఏకగ్రీవం చేస్తారా అంటూ సవాల్ విసిరాడు.అంతే కాకుండా చాలా మంది గతంలో చేసిన తప్పుల గురించి ఆయన ఎద్దేవ చేశాడు.
మొత్తంగా మా ఎన్నికల వేడిని ఆయన రాజేశాడు అనడంలో సందేహం లేదు.పెద్ద ఎత్తున ఆయన గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆయనకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఆయన ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్ కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరు కూడా ఇవి ఒక పొలిటికల్ ఎన్నికల మాదిరిగా మార్చేశారు.
దాంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
ఇన్ని రోజులు ప్రకాష్ రాజ్ కాస్త సైలెంట్ గా ఉన్నా కూడా ఇప్పుడు సీరియస్ అవుతున్నాడు.
నేను మోనార్క్ ను నన్ను ఎవడు మోసం చేయలేడు అనే డైలాగ్స్ ను వాడుతూ అందరి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నాడు.నటీ నటులను మరియు సాంకేతిక నిపుణులను పదే పదే ఆయన కలిసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
అంతే కాకుండా మా సభ్యుల కోసం చాలా ఖర్చు చేసి మరీ లంచ్ పార్టీని ఇచ్చాడు.అందులో తాను చేయబోతున్న పనులు ఏంటీ అక్కడ తాను చెప్పాలనుకున్న విషయాలు అన్ని చెప్పేశాడు.
ఖచ్చితంగా తాను పది కోట్లతో పేద కళాకారుల కోసం కార్పస్ ఫండ్ ను క్రియేట్ చేస్తాను అంటూ ప్రకటించడంతో పాటు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతాను అంటూ పేర్కొన్నాడు.ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకరి పై ఒకరు మరెంతగా విమర్శలు గుప్పించుకుంటారో అంటూ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంతగా గొడవ పడ్డ వారు ముందు ముందు ఎలా కలిసి నటిస్తారో అర్థం అవ్వడం లేదు అంటూ ఇండస్ట్రీలో కొందరు జుట్టు పీక్కుంటున్నారు.