“మా” అధ్యక్ష పదవిని మంచు విష్ణు అధిరోహించడం తెలిసిందే.దాదాపు 400 కి పైగా మెజారిటీతో విజయం సాధించి.
మంచు విష్ణు “మా” అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల కోసం గత కొన్ని రోజుల నుండి… ప్రకాష్ రాజ్ ప్యానల్ అదే రీతిలో మంచు విష్ణు ప్యానల్ కి చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
అయినా గాని మా ఎన్నికల పోలింగ్ సమయంలో… రెండు ప్యానల్ కి చెందిన వాళ్లు కలిసి పోయారు.ఈ క్రమంలో ఎన్నికల టైంలో హైలెట్స్ చూస్తే… ఈ ఎన్నికల కోసం ముంబై నుండి జెనీలియా విమానంలో వచ్చి ఓటేయడం.
అదేరీతిలో పవన్ కళ్యాణ్… “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో.మోహన్ బాబు ని విమర్శించడం.ఆ తర్వాత మోహన్ బాబు పవన్ కి కచ్చితంగా రిప్లై ఇస్తాను అని తెలపడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చి.
మోహన్ బాబు ని కౌగలించుకుని ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడారు.దాదాపు కొద్ది నిమిషాల పాటు పవన్.మోహన్ బాబు మాట్లాడుకోవడం జరిగింది.ఆ తర్వాత మంచు మనోజ్ తో కూడా ముచ్చటించిన పవన్.
అతన్ని కౌగిలించుకొని మరి.ఆప్యాయంగా మాట్లాడారు.
ఇదిలా ఉంటే మంచు విష్ణు ప్యానల్ కి చెందిన శివ బాలాజీ ని ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన హేమ నోటితో కొరికేసింది.దీంతో శివ బాలాజీ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజక్షన్ చేయించుకున్నారు.ఇదే తరుణంలో చాలా సామరస్య వాతావరణంలో… ప్రచారంలో ఉన్న వేడి మాదిరిగా కాకుండా పోలింగ్ సమయంలో… ప్రకాష్ రాజ్… మంచు విష్ణు ప్యానల్ కి చెందిన వాళ్ళు కలిసిపోయి.”మా” అనేది ఒక కుటుంబం అన్న తరహాలో వ్యవహరించారు.ఏది ఏమైనా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ “మా” ఎన్నికలలో… మంచు విష్ణు విజయం సాధించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.