టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి.ఈ రోజు మా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అందరిలో ఒక టెన్షన్ మొదలయ్యింది.
ఈ రోజు సాయంత్రానికి రిజల్స్ తెలుస్తాయి కాబట్టి అప్పటి వరకు ఈ టెన్షన్ అందరిలో ఉంటుంది.ఎప్పుడు సాదాసీదాగా జరిగే మా ఎన్నికలు ఈసారి వాద ప్రతివాదనలు చేసుకుంటూ హీట్ పెంచేసాయి.
మా అధ్యక్షా పదవికి చాలా మంది పోటీ పడాలని బరిలోకి దిగారు.కానీ సమయం దగ్గర పడుతుండడంతో ఒక్కొక్కరుగా డ్రాప్ అవుతూ చివరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు.
ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా మారింది.వీరిద్దరూ మధ్య పోటీ గట్టిగానే ఉండడంతో ఎవరు గెలుస్తారా అని అందరిలో ఒక ఉత్కంఠ కలుగుతుంది.
ఈ రోజు ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా జెనీలియా కూడా ఓటు వేసేందుకు ముంబై విమానం ఎక్కి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది.ఈమెను ఇక్కడ చూసి చాలా మంది ఆశ్చర్య పోయారు.అయితే ఈమె రావడం వెనుక మంచు విష్ణు ఉన్నాడని తెలుస్తుంది.జెనీలియా కు అన్ని ఏర్పాట్లు చేసి మంచు విష్ణు ఇక్కడికి తీసుకు వచ్చాడని తెలుస్తుంది.జెనీలియా ఓటింగ్ దగ్గరకు రాగానే ఆమెను స్వయంగా లోపలి తీసుకెళ్లాడు విష్ణు.
దీంతో ఆమె మంచు విష్ణు కె ఓటు వేయడానికి వచ్చినట్టు తెలిసింది.ఆమె ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చి మంచు విష్ణు తో కలిసి మీడియాతో ముచ్చటించారు.తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినిల్లు నాకు.
ఇక్కడి ప్రజలంతా నా కుటుంబం.అని అన్నారు.
మా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇస్తున్నారని అడిగితే.మా ఎన్నికల్లో మంచి వ్యక్తి మాత్రమే విజేత అవుతాడు.
మనం త్వరలో ఒక సూపర్ ప్రెసిడెంట్ ను చూస్తాం.అని చెప్పారు.