ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడమే కాకుండా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలోనే నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం.ఇదిలా ఉండగా తాజాగా ప్రకాష్ రాజ్ బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే అలీ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ… గతంలో తనని టాలీవుడ్ నిర్మాతలు బ్యాన్ చేయడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూనే… నిర్మాతలు తనని బ్యాన్ చేయడానికి కారణాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్ లో ఒకతను విచక్షణారహితంగా ఓ అమ్మాయి పై రాళ్ల దాడి చేస్తున్నాడు.
దీంతో తను ఒక వ్యక్తిని పక్కన తోయడంతో తన పై చెయ్యి చేసుకున్నానని చెప్పి నాపై కేసు వేయడంతో నిర్మాతలు తనని బ్యాన్ చేశారని ఈ సందర్భంగా ప్రకాష్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి ఆగడు సినిమా నుంచి కూడా తనని తీసేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు దర్శకుడు శ్రీను వైట్లకు మధ్య ఓ సన్నివేశం కోసం విభేదాలు వచ్చాయి.ఓ సన్నివేశంలో భాగంగా శ్రీనువైట్ల చాలా స్పీడ్ పెంచాలని చెప్పినప్పుడు అది నాకు నచ్చడం లేదని తనతో చెప్పగా తనకు శ్రీను వైట్లకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని ఆ మరుసటి రోజే సినిమా సెట్ లో సోనుసూద్ ఉన్నారని, నిజానికి ఆ పాత్రలో నేను చేయాల్సి ఉండగా నన్ను తీసేసి సోనూసూద్ ను పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకాష్ రాజు తెలియజేశారు.