తెలుగు చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కార దిశగా ఒక్కొక్కరూ ముందడుగు వేస్తున్నారు.నటీ నటుల పారితోషికాలు, చిత్ర నిర్మాణ వ్యయం తగ్గింపుతో పాటు ఎగ్జిబిటర్ సమస్యలు తదితర విషయాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు సైతం ఆపేశారు.
సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య మీటింగ్ జరిగింది.సమావేశంలో చర్చించిన విషయాలపై ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు ట్వీట్ చేశారు.‘మా’ సంక్షేమ కమిటీ వినతిపత్రాన్ని దిల్ రాజుకు అందించామని తెలిపారు.అదేవిధంగా కొత్త వారిని ప్రోత్సహించాలని కోరినట్లు చెప్పారు.కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చి ‘మా’లో భాగస్వామ్యం చేయాలని కోరినట్లు మంచు విష్ణు ట్వీట్టర్ వేదికగా తెలిపారు.