తెలుగు రాష్ట్రాల్లో లంపి స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.తెలంగాణ, ఏపీలో పశువులకు వైరస్ సోకుతుంది.
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి కేసు నమోదైంది.నంద్యాలలోని డోన్ మండలం చనుగొండ్లలో ఓ కోడె దూడకు వైరస్ సోకింది.
దీంతో పశువైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు.గత నెలలో డోన్ సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
అయితే, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పశువులకు లంపి స్కిన్ వైరస్ సోకిన విషయం తెలిసిందే.