ఎన్నారై మహిళ నుంచి ఫోన్లు కొట్టేసిన దొంగలు.. ఎక్కడంటే!

ఇంగ్లాండ్( England ) నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఓ ఎన్నారై మహిళకు ఇద్దరు యువకులు భారీ షాక్ ఇచ్చారు.ఆమె వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు లాక్కుని పరారయ్యారు.

 Ludhiana Thieves Stole Mobile Phone And Cash From Nri Woman, England, Nri Woman,-TeluguStop.com

ఆ మహిళా ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదైంది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని జాగ్రావ్ ప్రాంతం( Punjab Jagraon )లో చోటుచేసుకుంది.

బాధితురాలు రాజ్‌వీర్ కౌర్ తన పోలీసు ఫిర్యాదులో తాను మార్చి 23న భారతదేశంలో దిగి తన సోదరితో కలిసి స్కూటర్‌పై వాహనంపై వెళ్తుండగా, ఇద్దరు యువకులు బైక్‌పై కులార్‌లోని వంతెన సమీపంలో తమ వద్దకు వచ్చారన్నారు.ఒక యువకుడు తన సోదరి చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడని.

అప్పుడు వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు సోదరి బైక్ నుంచి పడిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత యువకులు వారిపై దాడి చేయడం ప్రారంభించారు.ఆపై ఆమె పర్సు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు.ఆమె పర్సులో ఐఫోన్( iPhone ), మరో మొబైల్ ఫోన్‌తో పాటు రూ.30,000 నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయని రాజ్‌వీర్ పేర్కొన్నారు.ఇద్దరు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 379 బి (స్నాచింగ్)( Snatching )కింద సదర్ జాగ్రావ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులను గుర్తించే ప్రయత్నంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.ఏఎస్ఐ రణధీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.ఈ ఘటనలో ఫిర్యాదురాలికి, ఆమె సోదరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ రకమైన నేరాలు భారతదేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తరచుగా జరుగుతుంటాయి.స్థానికులకు, పర్యాటకులకు ముప్పును కలిగిస్తాయి.ఇలాంటి ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండటం, నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పోలీసులు సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube