మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చూపేందుకు చిరు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టేందుకు చిరు సిద్ధమయ్యాడు.
ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రీమేక్ రైట్స్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకోగా, ఈ సినిమాను మెగాస్టార్తో చేసేందుకు రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను యంగ్ డైరెక్టర్ సుజీత్కు అప్పగించారు.ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగులను రాసే బాధ్యతను ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాకు అప్పగించడంతో ఆయన ఇప్పటికే డైలాగ్ వర్షన్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించాలని సుజీత్ అండ్ టీమ్ భావిస్తున్నాడు.
ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఇందులో నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.