లూసీఫర్ చిత్రంను చిరంజీవి చేస్తున్నాడు అని బలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
సాహో దర్శకుడు సుజీత్ ఈ రీమేక్ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం అయితే జరుగుతోంది.ఇటీవలే సుజీత్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడని మెగా వర్గాల ద్వారా అనధికారికంగా క్లారిటీ వచ్చింది.
ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ను విన్న చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశాడట.
తెలుగు నేటివిటీ కోసం అంటూ మార్పులు చేర్పులు చేసి మొత్తం కథను మార్చేశాడని అది కూడా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని మెగా వర్గాల వారు అంటున్నారు.రీమేక్ రైట్స్ బాధ్యతలను చిరంజీవి మరో దర్శకుడికి అప్పగించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
గతంలో చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 చిత్రాలను వినాయక్ దర్శకత్వంలో చేశాడు.ఆ రెండు కూడా రీమేక్లే అనే విషయం తెల్సిందే.
ఆ రెండు సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ రీమేక్ బాధ్యతలను కూడా వినాయక్కు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సుజీత్ దర్శకత్వంలో ఇంత పెద్ద రీమేక్ ను చేయడం సరికాదనే అభిప్రాయంను మొదటి నుండి కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు వారి అభిప్రాయంతో చిరంజీవి ఏకీభవించి తన నిర్ణయాన్ని మార్చుకుని వినాయక్కు అప్పగించినట్లుగా తెలుస్తోంది.