‘జోరుగా హుషారుగా షికారు పోదమా…హాయి హాయిగా తీయ తీయగా…’ అని పెళ్లికాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాడుకోవచ్చు.ఎందుకిలా పాడుకోవడం అనుకుంటున్నారా? లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) నిబంధనను కేంద్ర ప్రభుత్వం మార్చింది.ఇప్పటివరకు ఈ సౌకర్యం అవివాహితులకు కొంత పరిమితి ఉండేది.పెళ్లయినవారు పిల్లా పాపలతో దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎల్టీసీ మీద వెళ్లే వెసులుబాటు ఉంది.కాని అవివాహితులు వారి హోం టౌన్కు అంటే సొంత ఊరికి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది.దేశంలోని నాలుగు ప్రాంతాలు చూసిరావాలంటే వారి సొంత డబ్బులు పెట్టుకొని పోవల్సిందే.
వివాహితులకు ఓ నిబంధన, అవివాహితులకు ఓ నిబంధన ఏమిటని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్లుంది.వివాహితులను ఎందుకు చిన్నబుచ్చడమని వారు కూడా ఎల్టీసీపై దేశంలోని ఏ ప్రాంతినికైనా వెళ్లవచ్చని సడలింపు ఇచ్చింది.
ఎల్టీసీ సౌకర్యం కింద ప్రభుత్వం ఉద్యోగులు ఎక్కడికి వెళ్లినా రాను పోను ప్రయాణ ఛార్జీలు చెల్లిస్తుంది.మొత్తం మీద కేంద్రం అవివాహిత ఉద్యోగుల అభిమానం పొందింది.