రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో అదేరీతిలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ప్రస్తుతం వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది.ఇలాంటి తరుణంలో ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని.గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో.
గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
ఈ క్రమంలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు కు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదే రీతిలో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈరోజు వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో .ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో.భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.