ఈ ప్రపంచంలో ఎప్పటికి ఎవరికి అర్ధం కానిది ప్రేమ.ప్రేమే అర్ధం కాదంటే ఆ ప్రేమికులు చేసే పనులు కూడా అంతు చిక్కవు.
కొందరికి ఆనందాన్ని, మరి కొందరిలో విషాదాన్ని నింపి నవ్వుకునే ఈ ప్రేమ మాయ ఎప్పటికి మిస్టరీనే.
ఈ విషయం చెప్పడం వెనక కారణం ఉంది.
అదేమంటే ఎవరైనా ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటారు.కానీ ఇక్కడొక ప్రేమ జంట తమ పెళ్లికి ఒప్పుకున్నా కూడా మరణించారు.
ఈ విషాద సంఘటన గురించి తెలుసుకుంటే.తెలంగాణలోని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడు దుబాయ్ లో పని చేస్తున్నాడు.
కాగా అదే గ్రామానికి చెందిన మనీషా అనే యువతితో ప్రేమలో పడి వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.
ఇక వీరి ప్రేమకు పెద్దల ఆశీస్సులు కూడ దక్కాయి.
ఏమైందో ఏమో తెలియదు గానీ నిన్న మనీషా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందట.ఈ విషయం తెలిసిన రాకేశ్ తట్టుకోలేక మనీషా నువ్వులేని లేని జీవితం నాకు వద్దు అంటూ.
అమ్మా నన్ను క్షమించు.మిమ్మలను విడిచి వెళ్తున్నా’ అని సెల్ఫీ వీడియో తీసుకుని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడట.
త్వరలో పెళ్లి చేసుకోబోయే ఆ ప్రేమికులు ఇద్దరూ మరణించడంతో లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.ఇకపోతే మనీషా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం అంతు చిక్కడం లేదట.
ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేబట్టారట.