లవర్ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా నటించిన ముంబై భామ రిద్ధి కుమార్.ఈ భామ చూడటానికి భాగానే ఉన్న కూడా లవర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
ఆ తరువాత మరో తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఈ భామకి అవకాశం రాలేదు.చిన్న సినిమాలు ప్రయత్నం చేస్తున్న కూడా ఎవరు కనికరించలేదు.
అయితే ఊహించని విధంగా ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ని రిద్ధి కుమార్ సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ లవ్ స్టొరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
యూవీ క్రియేషన్స్ లో మరోసారి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రాబోతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు రిద్ధి కుమార్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది.ఇక పాన్ ఇండియా మూవీ అది కూడా ప్రభాస్ తో అంటే కచ్చితంగా తన క్రేజ్ మారిపోవడం గ్యారెంటీ అని భావించిన ఈ భామ ఇంకేమీ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
అయితే ఇందులో ఈ భామది సెకండ్ హీరోయిన్ పాత్రనా లేక ఏదో రెండు మూడు సన్నివేశాలకి పరిమితం అయ్యే పాత్రనా అనేది మాత్రం తెలియరాలేదు.