అబ్బబ్బా.ఈ మధ్యకాలంలో ప్రేమికులు మరి పిరికివారు అయిపోయారు.ప్రేమించినప్పుడు ఎదిరించేకి ఎందుకో అంత బయపడుతారు.ఎదిరించలేనప్పుడు ప్రేమించడం ఎందుకు? అనుకుంటాం కానీ ప్రేమ ఏమైనా అనుకోని పుడుతుందా? లేదు కదా! ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రేమించుకున్నారు.కానీ ఎదిరించే శక్తి లేక ఒకే చెట్టుకు ఉరి వేసుకొని మరణించారు
ఈ దారుణమైన ఘటన.ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి నకిటిసిమడ పంచాయతీ కడియపారా గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రంభగోడో, అమల్సింగ్గోడో కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది.దీంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్లేవారు.ఆ సమయంలోనే వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది
ఈ విషయాన్నే పెద్దలకు చెప్పగా.వారు నిరాకరించారు.
దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట రాత్రి ఇంటి నుండి గ్రామశివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒకరినొకరు కౌగిలించుకుని ఒకే చెట్టుకు ఒకే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు
అయితే పిల్లలు కనిపించలేదని తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించగా వారు అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గమనించి వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.కాగా స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
.