ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి హృదయాల్ని కొల్లగొట్టిన భామ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారినా నిర్మాతలు వరుసగా ఆమె డేట్స్ కోసం వెళ్లిన ఎలాంటి మొహమాటం లేకుండా అందరికి నో చెప్పేసింది.
కమర్షియల్ హీరోయిన్ లా కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రల జోలికి పోకుండా చేసేవి తక్కువ సినిమాలు అయిన తన పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి అనుకుంటూ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.బెస్ట్ పెర్ఫార్మర్ కావడంతో ప్రతి సినిమాలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది.
అయితే ఆమె దురదృష్టం కొద్ది ఫిదా సినిమా తర్వాత సూర్య, ధనుష్, శర్వానంద్ లాంటి స్టార్స్ తో చేసిన ఆమెకి సరైన హిట్ రాలేదు.హిట్, ఫ్లాప్ అనే లెక్కలు వేసుకోకుండా తన దగ్గరకి వచ్చిన కథలలో సాయి పల్లవి బెస్ట్ ఎంచుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది.ఫిదా సినిమాలో చాలా రఫ్ క్యారెక్టర్ చేసిన సాయి పల్లవి ఇందులో కాస్తా ఎమోషనల్ రోల్ లో కనిపించబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కేవలం క్లైమాక్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.మరల ఇప్పుడు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ షూటింగ్ కి మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలన్నీ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేస్తున్నామని, ఏకధాటిగా 15 రోజులు జరిగే ఈ షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.చిత్రీకరణలో పాల్గొనే వాళ్లందరికీ ముందే కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, షెడ్యూల్ పూర్తయ్యేవరకూ ఇంటికి వెళ్లకుండా లొకేషన్లోనే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అలాగే షూటింగ్ సెట్ లో 15మంది మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం అని చెప్పారు.మొత్తానికి ఏకధాటిగా రెండు వారాలు షూటింగ్ చేసి లవ్ స్టోరీకి గుమ్మడికాయ కొట్టేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది
.