నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ చివరి దశ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.అతి తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ సమక్షంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ మరియు వీడియోలు విడుదల చేశారు.తాజాగా షూటింగ్ ను ముగించేశారు అంటూ సమాచారం అందుతోంది.
రెండు వారాలకు పైగా ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ నిర్వహించారు.దీంతో షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయబోతున్నారు.ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్లకు రావడం ప్రారంభం అయితే అప్పుడు సినిమాను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు.
మొత్తానికి ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
లవ్ స్టోరీ సినిమా పాటలు మరియు టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతుందట.
నాగచైతన్య షూటింగ్ ను ముగించుకుని ఇంటికి వెళ్లి పోయాడని తెలుస్తోంది.షూటింగ్ ప్రారంభం నుండి పూర్తి అయ్యే వరకు యూనిట్ సభ్యులు ఎవరు కూడా వారి వారి ఇంటికి వెళ్లకూడదు అంటూ ముందుగానే నిర్ణయించారు.
అన్నట్లుగానే ఎవరు కూడా ఇళ్లకు వెళ్లకుండా షూటింగ్ చేశారు.షూటింగ్ ముగియడంతో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా వారి వారి ఇళ్లకు చేరిపోయారు.
ప్యాచ్ వర్క్ పూర్తి అయితే మిగిలిన వారు అంతా కూడా ఒకటి రెండు రోజుల్లో గుమ్మడి కాయ కొట్టేయబోతున్నారు.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
సమ్మర్ లో ఈ సినిమా విడుదల అవుతుందని ఎదురు చూస్తే సినిమా ఇలా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.