యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్స్టోరి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.
అయితే ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.ఈ మేరకు తాజాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్కు ఏకంగా రూ.18 కోట్లకు అమ్ముడయ్యాయట.నాగ చైతన్య రేంజ్కు ఇది మంచి రేటు అని చెప్పాలి.
ఇక ఈ సినిమాతో మరోసారి ఫిదా లాంటి సక్సెస్ను అందుకోవడానికి శేఖర్ కమ్ముల అండ్ టీమ్ రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.కాగా ఈ సినిమాతో చైతూ కూడా అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
మరి లవ్ స్టోరి చిత్రం అతడి కెరీర్లో ఎలాంటి హిట్ మూవీగా నిలుస్తోందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.