టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకంటూ ప్రేత్యేక క్రేజ్ను దక్కించుకున్న చిత్రం లవ్స్టోరి.ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే తమిళంలో మాత్రం ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే సూచన కనిపించడం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.తమిళనాట కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో అక్కడ మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
అయితే లాక్డౌన్ విధించకపోయినా, థియేటర్లు 50 శాతం అక్యుపెన్సీతో రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.దీంతో లవ్ స్టోరి చిత్రాన్ని ఇలాంటి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయడం మంచిది కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి నెలకొంటే, లవ్ స్టోరి చిత్రాన్ని నేరుగా శాటిలైట్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి లవ్స్టోరి చిత్రం తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటే, తమిళంలో మాత్రం శాటిలైట్ రిలీజ్కు రెడీ అవుతోంది.
దీంతో తమిళనాట కూడా ఈ సినిమా నేరుగా థియేటర్లలో చూడాలని అక్కడి ప్రేక్షకులు కోరుతున్నారు.తమిళంలో సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో థనుష్ మారి-2 చిత్రంతో మనకు తెలిసిపోయింది.
మరి ఈ రౌడీ బేబి సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారా లేక నేరుగా టీవీల్లో చూస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.