టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తుంది.ఈ మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించి మళ్ళీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే మళ్ళీ ఈ మధ్య సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఈ నేపద్యంలో నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.
యూట్యూబ్ లో రిలీజ్ అయినా ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డ్ వ్యూస్ సాధించి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.
ఈ ట్రైలర్ విడుదల అయినా 24 గంటల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది.
4 మిలియన్ ప్లస్ వ్యూస్ తో పాటు 300K ప్లస్ లైక్స్ తో రికార్డ్ సృష్టించింది.ఈ ట్రైలర్ చుసిన అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.తెరపైన నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది.
వీరిని శేఖర్ కమ్ముల ఎంత బాగా చుపించారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆత్రంగా చూస్తున్నారు.
మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాకు పవన్ సిహెచ్ అందించిన సంగీతం గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే విడుదల అయినా అన్ని పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.