టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక దీనికి తోడుగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు బాగుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
కాగా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఫిబ్రవరి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.కానీ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సినిమా రిలీజ్ను వెనక్కి నెట్టాడట దర్శకుడు శేఖర్ కమ్ముల.
ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తే బాగుంటుందని దర్శకుడు శేఖర్ కమ్ముల భావిస్తున్నాడు.దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తే వేసవి సందడి మొదలవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.
పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, చైతూల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రొమాంటిక్ చిత్రాల హవా మొదలవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే లవ్స్టోరి చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.వేసవి కానుకగా ఏప్రిల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడం వెనుక శేఖర్ కమ్ముల స్ట్రాటెజీ ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.