చూడచక్కని ప్రేమ జంట కథను విషాదాంతం చేసిన కరోనా

ఇటలీ లో మృత్యుఘోష తలపిస్తున్న కరోనా వల్ల ఇప్పటివరకు 12 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 45 వేల మంది మృతి చెందారు.

 Love Story, Italy, Coronavirus, Corona Effect-TeluguStop.com

అయితే ఈ 45 వేల మందిలో ఒక్క ఇటలీ లోనే 12 మంది మృతి చెందడం ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఇంత భారీ స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్న ఇటలీ లో ఒక ప్రేమ జంట కథ ను కరోనా విషాదాంతం చేసింది.

వివరాల్లోకి వెళితే… ఇటలీ లోని సిసిలీ కి చెందిన లారెన్ క్వారంటా అనే డాక్టర్, ఆంటోనియో డి పేస్ అనే మేల్ నర్సు లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరూ కూడా ఒకే ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రియురాలు సేవలు చూసి అద్భుతం అంటూ గతవారమే తెగ పొగడ్తలు కూడా కురిపించాడు.అయితే తరువాత అతడు నిదానంగా అనారోగ్యం పాలవ్వడం తో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

ఆమె ద్వారానే తనకు కరోనా సోకింది అంటూ అనుమానించిన ఆంటోనియా ఆమె పై కోపాన్ని పెంచుకొని గొంతు నులిమి చంపేసినట్లు తెలుస్తుంది.ఆ తరువాత తర్వాత తన మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు.

అయితే వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అయితే ఇంతకీ ఆసుపత్రిలో తెలిసిన నమ్మలేని నిజం ఏమిటంటే లారెనా, ఆంటోనియోల్లో ఎవరికీ కరోనా లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు.

కేవలం తనకు కరోనా సోకింది అంటూ అనుమానించిన ఆంటోనియా భయం తో ఇలా ప్రియురాలి పై అనుమానం పెంచుకొని ఆమె ప్రాణాలను బలిగొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube