ఇటలీ లో మృత్యుఘోష తలపిస్తున్న కరోనా వల్ల ఇప్పటివరకు 12 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 45 వేల మంది మృతి చెందారు.
అయితే ఈ 45 వేల మందిలో ఒక్క ఇటలీ లోనే 12 మంది మృతి చెందడం ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఇంత భారీ స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్న ఇటలీ లో ఒక ప్రేమ జంట కథ ను కరోనా విషాదాంతం చేసింది.
వివరాల్లోకి వెళితే… ఇటలీ లోని సిసిలీ కి చెందిన లారెన్ క్వారంటా అనే డాక్టర్, ఆంటోనియో డి పేస్ అనే మేల్ నర్సు లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కూడా ఒకే ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రియురాలు సేవలు చూసి అద్భుతం అంటూ గతవారమే తెగ పొగడ్తలు కూడా కురిపించాడు.అయితే తరువాత అతడు నిదానంగా అనారోగ్యం పాలవ్వడం తో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.
ఆమె ద్వారానే తనకు కరోనా సోకింది అంటూ అనుమానించిన ఆంటోనియా ఆమె పై కోపాన్ని పెంచుకొని గొంతు నులిమి చంపేసినట్లు తెలుస్తుంది.ఆ తరువాత తర్వాత తన మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు.
అయితే వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అయితే ఇంతకీ ఆసుపత్రిలో తెలిసిన నమ్మలేని నిజం ఏమిటంటే లారెనా, ఆంటోనియోల్లో ఎవరికీ కరోనా లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు.
కేవలం తనకు కరోనా సోకింది అంటూ అనుమానించిన ఆంటోనియా భయం తో ఇలా ప్రియురాలి పై అనుమానం పెంచుకొని ఆమె ప్రాణాలను బలిగొన్నాడు.