యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా ప్రేమకథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు చైతూ యాక్టింగ్ ఇరగదీశాడని ప్రశంసిస్తున్నారు.ఈ సినిమా విడుదల అయినా రోజు ఎలాంటి స్పందన లభించిందో ఇప్పటికి అదే స్పందన వస్తుంది.
ఇక ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, నాగ చైతన్య జంట అయితే తెర మీద కన్నుల పండుగగా ఉంది.ఇక ఈ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్న చైతూ అదే జోష్ తో తను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో పడ్డాడు.
ఈ సినిమా తర్వాత ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
దీనితో పాటు నాగార్జున ‘బంగార్రాజు‘ సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాలో చైతు కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.
ఇక ఈ సినిమాతో పాటు చైతు బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా‘ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇది ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా చైతు పరిచయం అవ్వబోతున్నారు.
ఇక లవ్ స్టోరీ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా అలరించింది.ఇక ఈ కాంబో మరొకసారి రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరొక సినిమాను చేస్తున్నామని నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు తెలిపారు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు.
అయితే ప్రెసెంట్ శేఖర్ కమ్ముల ధనుష్ తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా పూర్తి అయినా తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ లోపు నాగ చైతన్య కూడా తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ఈ సినిమా కోసం రెడీ అవబోతున్నాడు.