ప్రేమికుల రోజు సందర్భంగా సిద్ధిపేట లో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ మైనర్ ప్రేమజంటకి బలవంతగా పెళ్లి చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ ప్రేమ జంట వ్యవహారం అక్కడితో మిగిసిపోలేదు.
అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెకి బలవంతంగా పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు పార్క్ లో జరిగిన ఆ బలవంతపు పెళ్లి ఎఫెక్ట్ ప్రేమ జంటపై పడింది.
విషయం సోషల్ మీడియా ద్వారా అందరికి తెలిసిపోవడంతో, వారి ఇళ్ళల్లో కుటుంబ సభ్యులు ఇద్దరిపై గట్టిగా సీరియస్ అయ్యి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమజంట ఈ రోజు సాయంత్రం హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం కి ప్రయత్నించారు.
ప్రేమ జంట ఆత్మహత్యయత్నం చేసే సమయంలో అక్కడే వున్నా రెస్క్యూ సిబ్బంది ప్రేమజంటకి రక్షించి వారి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు.
ఇప్పుడు ప్రేమజంట ఆత్మహత్య ప్రయత్నం వరకు రావడంతో ఈ సంఘటన మరింత సీరియస్ అయ్యే అవకాశం వుందని తెలుస్తుంది.మరి భజరంగ్ దళ్ కార్యకర్తలు తాము చేసిన నిర్వాకాన్ని ఇప్పుడు ఎలా సమర్దిన్చుకుంటారు అనేది చూడాలి.