టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వరుసగా ట్రిప్పులు చేయగా అది కూడా మాల్దీవులకే పయనమవుతున్నారు.ఎందుకో తెలియదు ప్రతి ఒక్క సినీ నటులు తమ కుటుంబాలతో కలసి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అక్కడ సముద్ర అందాల తో పాటు తమ అందాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.సముద్రం మధ్యలో ఉన్న అందాలను ఆస్వాదిస్తూ వాటికి తగ్గట్టుగా పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నటి బిపాసా బసు తన భర్తతో వెళ్ళిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా టాలీవుడ్ నటులు మంచు లక్ష్మి, కాజల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగార్జున ఇలా మాల్దీవుల కే ప్లాన్ చేశారు.ఇక బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, అలియా భట్, శిల్పా శెట్టి లు తమ ఫ్యామిలీ లతో ట్రిప్ ఎంజాయ్ చేయగా తాజాగా మరో జంట కూడా మాల్దీవుల కే వెళ్ళారు.ఇంతకీ ఆ జంట ఎవరో కాదు త్వరలో పెళ్లి చేసుకోబోయే గుత్తా జ్వాల, విష్ణు విశాల్.
ప్రముఖ బ్యాడ్మింటర్ స్టార్ గుత్తా జ్వాల తో తమిళ హీరో విష్ణు విశాల్ ఇటీవలే మాల్దీవులకు వెళ్లగా విశాల్ సోషల్ మీడియాలో తనతో దిగిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశాడు.అందులో వీళ్ళ ఫోటోలు చూసిన నెటిజనులు పెళ్లికి ముందే మాల్దీవ్ ట్రిప్పులు చేస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు.
గత కొంతకాలం నుండి ఇద్దరు ప్రేమ లో ఉండగా కొన్ని రోజుల కిందట వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది.ఇక వీరి పెళ్లి గురించి ప్రస్తుతం ఎటువంటి విషయాలు తెలియక పోగా ప్రస్తుతం ఈ జంట మాల్దీవులో ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించగా, హీరో విష్ణు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.