శనివారం ఈ ఒక్క పని చేస్తే ఇబ్బందులు,సమస్యలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది

మీరు చాలా బాధలు పడుతున్నామని అందుకుంటే చాలా చిన్న ప్రయత్నంతో సదరు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.చాలామందిని చూస్తే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తారు.

 Lord Venkateswara Swamy Deeparadhana Pooja-TeluguStop.com

ఆందోళనకు గురి అవుతూ కనిపిస్తారు.ఎదో అయిపోతున్నట్లు ఫీలవుతూ ఉంటారు.

అదే అతి చిన్న ప్రయత్నం ద్వారా బాధల నుంచి విముక్తి పొందవచ్చు.

ఉదయం లేవగానే భూమికి నమస్కరించి , దేవుడికి నమస్కరించి,దైనందిన పనుల్లో నిమగ్నం అవ్వాలి.ఇక బయటకు వెళ్లేముందు భార్యతో గానీ, తల్లితో గానీ మాట్లాడి,ఒక్కరూపాయి వాళ్ళ చేత స్వీకరించి జేబులో వేసుకుని వెళ్తే, ఇక మీకు బ్రహ్మ యోగం పట్టినట్లేనని కొందరు పండితులు అంటున్నారు.

ఇక శనివారం ఉదయం నాలుగు గంటలకు అంటే దాన్ని శని ఉషక్కాలం అంటారు.

శనివారం రోజు మాత్రమే శని ఉషక్కాలం ఉంటుంది.ఆసమయంలో దీపారాధన చేస్తే మనకు గల ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి.

ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శనివారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే,ఇబ్బందులు,బాధలు సమసిపోతాయని పండితుల మాట.ఇక అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది.కాబట్టి వీలు అయినంత వరకు ఇలా చేస్తే మీ ఇబ్బందులు తొలగిపోతాయి.దీపారాధన వీలును బట్టి ఇంటిలో ఎవరైనా చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube