అమెరికాలో తెలుగువారు గర్వపడేలా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్న తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తన 22 వ మహాసభల నిర్వహణ కోసం ఎన్నో కార్యక్రమాలని చేపడుతోంది.తెలుగు సంస్కృతిని అద్దంపట్టేలా ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తోంది.
ఈ క్రమంలోనే జూలై 4 నుంచి 6వ తేదీ వరకూ జరగనున్న మహా సభలలో శ్రీనివాస కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జులై 6వ తేదీన నిర్వహిస్తున్నారు.ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలని అందుకే శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తెలుగు వారు అందరూ రావాలని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఛైర్మెన్ గా లక్ష్మీ దేవినేని, ఆధ్యాత్మిక కమిటీ ఛైర్మెన్ గా సుబ్బువారణాశి, కో ఆర్డినేటర్గా సుబ్బారావు చెన్నూరి నియమితులు అయ్యారు.ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా పిఎంజె జ్యూవెల్స్ వ్యవహరిస్తోంది.
అంతేకాదు ప్రముఖ గాయని స్మిత స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నారు.